మదన్‌మోహన్‌రెడ్డికి జాతీయ విజ్ఞాన అవార్డు

ABN , First Publish Date - 2021-03-01T09:35:02+05:30 IST

పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషిలో భాగంగా అనంతపురం జిల్లా తాలూవుల మండలానికి చెందిన గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి సంఘానికి జాతీయ గుర్తింపు దక్కింది.

మదన్‌మోహన్‌రెడ్డికి జాతీయ విజ్ఞాన అవార్డు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషిలో భాగంగా అనంతపురం జిల్లా తాలూవుల మండలానికి చెందిన గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి సంఘానికి జాతీయ గుర్తింపు దక్కింది. 2018 ఏడాదికిగానూ ఈ సంఘానికి జాతీయ విజ్ఞాన అవార్డు లభించింది. జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా ఆదివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో కేంద్ర విజ్ఞాన, సాంకేతిక, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ చేతుల మీదుగా ఆ సంఘం అధ్యక్షుడు బి.మదన్‌మోహన్‌రెడ్డి అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన ఐబీఎం రిసెర్చ్‌ ఇండియా డైరెక్టర్‌ డా.గార్గి బి దాస్‌ గుప్తా కూడా పాల్గొన్నారు. వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో పర్యావరణ పరిరక్షణకు ఈ సంఘం గత కొన్నేళ్లుగా తీవ్రంగా కషిచేస్తోంది. 

Updated Date - 2021-03-01T09:35:02+05:30 IST