TS News: వరంగల్లో ఘనంగా జాతీయ సమైక్యత వేడుకలు
ABN , First Publish Date - 2022-09-17T15:21:50+05:30 IST
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జాతీయ సమైక్యత వేడుకలు వరంగల్ ఘనంగా నిర్వహించారు.
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జాతీయ సమైక్యత వేడుకలు (National unity celebrations) వరంగల్ ఘనంగా నిర్వహించారు. జనగామ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ (Errabelli dayakar rao) జాతీయ జెండా (National flag)ను ఎగురవేశారు. హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్ (Dasyam vinay bhasker) త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అటు మహబూబాబాద్లో మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavati rathod)జాతీయ జెండాను ఎగురవేశారు. ఖిలా వరంగల్లో త్రివర్ణ పతాకాన్ని ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి (JR Reddy) ఎగురవేశారు. అలాగే భూపాలపల్లిలో ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ (Anurag sharma) జాతీయ జెండాను ఆవిష్కరించారు. ములుగులో ప్రభుత్వ విప్ ఎమ్ ఎస్ ప్రభాకర్ రావ్(S Prabhakar Rao) జాతీయ జెండా ఎగురవేశారు.