చిత్తూరు జిల్లాలో నాటుసారా ధ్వంసం

ABN , First Publish Date - 2022-01-13T02:25:04+05:30 IST

జిల్లాలోని ఐరాల మండలం దివిటివారిపల్లి దగ్గర అటవీ ప్రాంతంలో

చిత్తూరు జిల్లాలో నాటుసారా ధ్వంసం

చిత్తూరు: జిల్లాలోని ఐరాల మండలం దివిటివారిపల్లి దగ్గర అటవీ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడి చేశారు. 1000 లీటర్ల నాటుసారాను, నాటుసారా తయారీకి ఉపయోగించే ఊట, ఐదు బస్తాల చెక్కను ధ్వంసం చేశారు. 10 లీటర్ల సారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ నాటుసారాను ఎవరూ కూడా తయారు చేయరాదన్నారు. నాటుసారాను తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  


Updated Date - 2022-01-13T02:25:04+05:30 IST