ముగిసిన సైకిల్‌ యాత్ర

ABN , First Publish Date - 2020-11-27T05:36:19+05:30 IST

నేవల్‌ డాక్‌యార్డు డిఫెన్స్‌ సివిల్‌ ఉద్యోగుల బృందం 700 కిలో మీటర్ల సైకిల్‌యాత్రను విజయవంతంగా గురువారం ముగించింది.

ముగిసిన సైకిల్‌ యాత్ర
సైకిల్‌యాత్రలో పాల్గొన్న డాక్‌యార్డు ఉద్యోగులు

విశాఖపట్నం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): నేవల్‌ డాక్‌యార్డు డిఫెన్స్‌ సివిల్‌ ఉద్యోగుల బృందం 700 కిలో మీటర్ల  సైకిల్‌యాత్రను విజయవంతంగా గురువారం ముగించింది. నేవల్‌ డాక్‌యార్డు నుంచి ఈ నెల 21న బయల్దేరిన బృందం ఒడిశాలోని చిలకా సరస్సు వరకు వెళ్లి తిరిగి వచ్చింది. మార్గమధ్యంలో పాఠశాలలకు వెళ్లి కరోనాపై విద్యార్థులకు అవగాహన కల్పించి, ఎన్‌ 95 మాస్కులు పంపిణీ చేశారు.  

Updated Date - 2020-11-27T05:36:19+05:30 IST