ముగిసిన సైకిల్ యాత్ర
ABN , First Publish Date - 2020-11-27T05:36:19+05:30 IST
నేవల్ డాక్యార్డు డిఫెన్స్ సివిల్ ఉద్యోగుల బృందం 700 కిలో మీటర్ల సైకిల్యాత్రను విజయవంతంగా గురువారం ముగించింది.
విశాఖపట్నం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): నేవల్ డాక్యార్డు డిఫెన్స్ సివిల్ ఉద్యోగుల బృందం 700 కిలో మీటర్ల సైకిల్యాత్రను విజయవంతంగా గురువారం ముగించింది. నేవల్ డాక్యార్డు నుంచి ఈ నెల 21న బయల్దేరిన బృందం ఒడిశాలోని చిలకా సరస్సు వరకు వెళ్లి తిరిగి వచ్చింది. మార్గమధ్యంలో పాఠశాలలకు వెళ్లి కరోనాపై విద్యార్థులకు అవగాహన కల్పించి, ఎన్ 95 మాస్కులు పంపిణీ చేశారు.