ఇద్దరు బాస్కెట్ బాల్ క్రీడాకారులకు కరోనా

ABN , First Publish Date - 2020-07-14T14:58:04+05:30 IST

ఇద్దరు బాస్కెట్‌బాల్ క్రీడాకారులకు కరోనా పాజిటివ్ సోకిందని నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఐ) మంగళవారం వెల్లడించింది.....

ఇద్దరు బాస్కెట్ బాల్ క్రీడాకారులకు కరోనా

న్యూయార్క్ (అమెరికా): ఇద్దరు బాస్కెట్‌బాల్ క్రీడాకారులకు కరోనా పాజిటివ్ సోకిందని నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఐ) మంగళవారం  వెల్లడించింది. ఎన్‌బీఐ క్యాంపస్ లో 322 మంది క్రీడాకారులకు పరీక్షలు చేయగా వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలిందని ఎన్‌బీఐ తెలిపింది. ఇద్దరు క్రీడాకారులకు కరోనా సోకడంతో వారిని హోం క్వారంటైన్‌కు తరలించారు.2019-20 సీజనులో బాస్కెట్ బాల్ పోటీలను జులై 30వతేదీ నుంచి ప్రారంభించాలని నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రకటించింది. ఎన్ బీఏ స్టార్, హౌస్టన్ రాకెట్ స్టార్ రస్సెల్ వెస్ట్ బ్రూక్ కు కరోనా వైరస్ సోకింది. తనకు కరోనా పాజిటివ్ అని రావడంతో తాను స్వీయ నిర్బంధంలో ఉన్నానని రస్సెల్ వెస్ట్ బ్రూక్ ట్వీట్ చేశారు. ప్రస్థుతం తాను క్షేమంగా క్వారంటైన్ లో కోలుకుంటున్నానని రస్సెల్ చెప్పారు. కరోనా వైరస్ సోకకుండా ఇంట్లోనే క్షేమంగా ఉండాలని, మాస్క్ ధరించాలని రస్సెల్ అభిమానులకు సూచించారు. 

Updated Date - 2020-07-14T14:58:04+05:30 IST