యోగాతో మానసిక ప్రశాంతత
ABN , First Publish Date - 2021-10-27T06:08:56+05:30 IST
యోగాతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుంద ని ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ జాహిద్ ఖాన్ అన్నారు.
ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ జాహిద్ ఖాన్
కొండపావులూరు కేంద్రంలో యోగా పోటీలు ప్రారంభం
నాలుగు రాష్ర్టాల నుంచి హాజరైన సిబ్బంది
గన్నవరం, అక్టోబరు 26 : యోగాతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుంద ని ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ జాహిద్ ఖాన్ అన్నారు. గన్నవరం మండలం కొండపావులూరు సర్వే నెంబర్ 6లో ఏర్పాటు చేసిన ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ నందు మంగళవారం ఇంటర్ బెటాలియన్, సౌత్జోన్ మరియు సౌత్ సెంట్రల్జోన్ యోగా పోటీలు ప్రారంభమయ్యాయి. తొలుత సిబ్బంది మార్చ్పాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ జాహిద్ ఖాన్ మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి జీవన విధానం కావాలన్నారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వంతో పాటు మంచి ఆరోగ్యం లభివచి మనిషి ఒత్తిడికి దూరమవుతాడన్నా రు. యోగాపై అవగాహన కల్పించేందుకు పోటీలు ఏర్పాటు చేశామని, ఒరిస్సా, తమిళనాడు, మహరాష్ట్ర, ఏపీ రాష్ర్టాల ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ సిబ్బంది పాల్గొని యోగాసనం, కళాత్మక యోగా, యాంటిస్టిక్ ఫెయిర్ యోగా, ఉచిత ఫ్లో యోగా నిత్యం వంటి ఐదు విభాగాల్లో పోటీలు నిర్వహించ టం జరిగిందన్నారు.