సమాజ సేవలో భాగస్వాములు కావాలి
ABN , First Publish Date - 2022-06-30T04:07:38+05:30 IST
సమాజ సేవలో లయన్స్ క్లబ్ సభ్యులు భాగస్వాములు కావాలని లయన్స్ క్లబ్ జీఎల్టి కోఆర్డినేటర్ డాక్టర్ మధుసూదన్రెడి అన్నారు. లయన్స్ క్లబ్ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకోని దండేపల్లిలో బుధవారం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం పూర్తిస్థాయి కమిటీని ప్రకటించారు
- లయన్స్ క్లబ్ జీఎల్టి కోఆర్డినేటర్ డాక్టర్ మధుసూదన్రెడి
దండేపల్లి, జూన్, 29: సమాజ సేవలో లయన్స్ క్లబ్ సభ్యులు భాగస్వాములు కావాలని లయన్స్ క్లబ్ జీఎల్టి కోఆర్డినేటర్ డాక్టర్ మధుసూదన్రెడి అన్నారు. లయన్స్ క్లబ్ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకోని దండేపల్లిలో బుధవారం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం పూర్తిస్థాయి కమిటీని ప్రకటించారు క్లబ్ మండల అధ్యక్షుడిగా జాబు సుగుణాకర్, ప్రధాన కార్యదర్శిగా బొలిశెట్టి రాజన్న, కోశాధికారిగా మాదంశెట్టి మల్లికార్జున్, ఉపాధ్యుక్షులుగా కుంచె కిషన్, బూసిరాజు రాజన్నల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్ర మంలో జోనల్ చైర్మన్ వంగల సంపత్కుమార్, రీజినల్ పర్సన్ ఉదారి చంద్రమోహాన్గౌడ్, జన్నారం మండల లయన్స్ కమిటీ సభ్యులు విజయ్కుమార్, బాపన్న, మల్లేశం, రాజశేఖర్, విద్యాసాగర్, మండల కమిటీ సభ్యులు అన్నం సత్యనారాయణ, కోండు జనార్దన్, పసర్తి సత్తయ్య, రామన్న, మల్లేష్, శ్రీనివాస్, విఘ్ణ, నర్సింగ్, శేకర్, సత్యంతో పాటు మంచిర్యాల, కరీంనగర్ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.