నైపుణ్యంతో ఆదాయం పెంచుకోవాలి

ABN , First Publish Date - 2021-03-02T05:31:09+05:30 IST

నైపుణ్యంతో ఆదాయం పెంచుకోవాలి

నైపుణ్యంతో ఆదాయం పెంచుకోవాలి

కొత్తవలస, మార్చి 1: గ్రామీణ యువత నైపుణ్యాన్ని పెంచుకుని ఆదాయం పెంపొందించుకునే విధంగా ముం దుకు సాగాలని ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్‌  ఎం. అశోక్‌ కు మార్‌ తెలిపారు. ప్రతిరైతు తనకు ఉన్నటువంటి వన రులపై సమగ్రమైన అవగాహన కలిగి ఆదాయం పెంచుకునే దిశగా కృషి చేయడానికి ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. సబల సంస్థ ఆధ్వర్యంలో ఆత్మసహకారంతో రాష్ట్ర వ్యవసాయ సాంకేతిక విస్తీర్ణ శిక్షణ సంస్థ నిర్వహిస్తున్న సమీకృత వ్యవసాయంపై శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్స్‌ అందచేశారు. వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ఎంఎంవీ శ్రీనివాసు, సబల సంస్థ కార్యదర్శి కె. సరస్వతి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-02T05:31:09+05:30 IST