కూలి చెల్లింపులో నిర్లక్ష్యం తగదు
ABN , First Publish Date - 2022-06-26T05:19:33+05:30 IST
ఉపాధి హామీ కింద పనులు చేస్తున్న కూలీలకు కూలి చెల్లింపులో నిర్లక్ష్యం తగదని, పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చే యాలని సీపీఎం రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ జాలా అంజయ్య అన్నారు.
సీపీఎం రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ అంజయ్య
ముండ్లమూరు, జూన్ 25 : ఉపాధి హామీ కింద పనులు చేస్తున్న కూలీలకు కూలి చెల్లింపులో నిర్లక్ష్యం తగదని, పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చే యాలని సీపీఎం రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ జాలా అంజయ్య అన్నారు. ఆయన మండలంలోని మారెళ్లలో శనివారం ఇంటింటికీ సీపీఎం కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా పలువురు కూలీలు ఏడువారాలుగా మాకు కూలి చెల్లించలేదని అంజయ్య వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పనులు కూడా నిలిపి వేశారన్నారు. సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి కూలి చెల్లింపులు జరిగేలా చూస్తామని అంజయ్య తెలిపారు. గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వెల్లంపల్లి ఆం జనేయులు, జాను, యాకోబు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.