పేదల పక్షపాతి నెహ్రూ
ABN , First Publish Date - 2021-04-18T06:19:48+05:30 IST
ఇచ్చిన మాటకు కట్టుబడి పేదల పక్షాన నిలబడ్డ మహనీయుడు మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ అని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ అన్నారు.
తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ దేవినేని అవినాష్
గుణదల, ఏప్రిల్ 17: ఇచ్చిన మాటకు కట్టుబడి పేదల పక్షాన నిలబడ్డ మహనీయుడు మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ అని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. దివంగత నెహ్రూ 4వ వర్ధంతి గుణదలలోని దేవినేని నెహ్రూ ఘాట్ వద్ద శనివారం నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ నెహ్రూ తన 20వ ఏట విద్యార్థి నేతగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుండి 70ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు పేదలకోసమే పనిచేసేవారన్నారు. జిల్లాలో 5సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఘనత దేవినేని నెహ్రూకే దక్కిందన్నారు. నెహ్రూ ఆశయ సాధనకు తన వంతు కృషి చేస్తానన్నారు. పటమట సెంటర్లో యు.ఎ్స.వో రాష్ట్ర అధ్యక్షుడు కొరివి చైతన్య (వర) ఆధ్వర్యంలో చీరల పంపిణీ, అన్నదానం నిర్వహించారు. అలాగే నగరంలోని పలు ప్రాంతాల్లో కార్పొరేటర్లు, అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో అవినాష్ పాల్గొన్నారు. వైసీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు, వైసీపీ ఫ్లోర్లీడర్ వెంకట సత్యన్నారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.