ఉద్యోగం ఇప్పిస్తామని ఢిల్లీ తీసుకెళ్లి దారుణం.. బాలికను అమ్మేసి ఘాతుకం..

ABN , First Publish Date - 2022-03-18T05:49:15+05:30 IST

ఆ బాలిక పదో తరగతి పూర్తి చేసి ఉద్యోగం చేయాలనుకుంది.. తన పక్కింట్లో ఉండే ఆంటీని ఉద్యోగం ఇప్పించమని అడిగింది. పక్కిటి మహిళ బాలికకు మరో మహిళను పరిచయం చేసింది...

ఉద్యోగం ఇప్పిస్తామని ఢిల్లీ తీసుకెళ్లి దారుణం.. బాలికను అమ్మేసి ఘాతుకం..

ఆ బాలిక పదో తరగతి పూర్తి చేసి ఉద్యోగం చేయాలనుకుంది.. తన పక్కింట్లో ఉండే ఆంటీని ఉద్యోగం ఇప్పించమని అడిగింది. పక్కిటి మహిళ బాలికకు మరో మహిళను పరిచయం చేసింది. ఆమెను నమ్మి ఢిల్లీ వెళ్లిన బాలికకు అక్కడ దారుణమైన అనుభవం ఎదురైంది.. ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకెళ్లిన మహిళ ఆ బాలికను వేరే వ్యక్తికి అమ్మేసింది.. అతను ఆ బాలికపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఫలితంగా గర్భం దాల్చిన బాలిక హాస్పిటల్‌కు వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. 


వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌లోని సురౌళి ప్రాంతానికి చెందిన పదో తరగతి బాలిక తన పక్కింట్లో ఉండే మహిళ మీద నమ్మకంతో ఉద్యోగం కోసమని ఢిల్లీ వెళ్లింది. ఆ బాలికను ఢిల్లీ తీసుకెళ్లిన మహిళ ఓ వ్యక్తికి అమ్మేసింది. ఆ వ్యక్తి ఆ బాలికపై ఏడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది. నెలలు నిండడంతో ఆ బాలిక హాస్పిటల్‌కు వెళ్లింది. అక్కడ వైద్యులు ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. 


విషయం తెలుసుకున్న వైద్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్‌కు చేరుకున్న పోలీసులు బాలిక స్టేట్‌మెంట్ మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితులందరి గురించి ఆరా తీస్తున్నారు.


Updated Date - 2022-03-18T05:49:15+05:30 IST