పని ఇప్పిస్తామని తీసుకొచ్చి.. మైనర్ బాలికను అమ్మేసిన పక్కింటి ఆంటీ

ABN , First Publish Date - 2022-04-24T06:10:42+05:30 IST

పని ఇప్పిస్తామని పక్కింటి ఆంటీ చెప్తే నమ్మేసిందా మైనర్ బాలిక. ఆమె పరిచయం చేసిన మహిళతో కలిసి ఢిల్లీ చేరుకుంది. అక్కడే ఆ బాలికను ఎవరికో అమ్మేశారు...

పని ఇప్పిస్తామని తీసుకొచ్చి.. మైనర్ బాలికను  అమ్మేసిన పక్కింటి ఆంటీ

పని ఇప్పిస్తామని పక్కింటి ఆంటీ చెప్తే నమ్మేసిందా మైనర్ బాలిక. ఆమె పరిచయం చేసిన మహిళతో కలిసి ఢిల్లీ చేరుకుంది. అక్కడే ఆ బాలికను ఎవరికో అమ్మేశారు. దానికితోడు ఆమెపై పలుమార్లు అత్యాచారం కూడా జరిగింది. 


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిలిగుడికి చెందిన సదరు యువతిని పొరుగింట్లో ఉండే ఒక మహిళ పని కోసం మమత అనే మహిళ వద్దకు పంపింది. బాలికను ఢిల్లీ తీసుకొచ్చిన మమత.. రీనా అనే తన స్నేహితురాలి ఇంటికి పంపింది. అక్కడే కొన్నిరోజులు ఉన్న తర్వాత పని ఇప్పించామని చెప్పి ఆ బాలికను రీనా, మమత అమ్మేశారు. 


ఆ తర్వాత రకరకాల ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో సదరు బాలికపై పలుమార్లు అత్యాచారాలు జరిగాయి. ఆమె గర్భందాల్చింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వైద్యులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు బాలికను రక్షించారు. ఆమె వాంగ్మూలం తీసుకొని నిందితులపై కేసు నమోదు చేసుకొని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మరికొన్ని రోజుల్లో నిందితులందర్నీ అదుపులోకి తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.


Updated Date - 2022-04-24T06:10:42+05:30 IST