నెల్లూరులో దారుణం

ABN , First Publish Date - 2021-04-23T13:22:44+05:30 IST

జిల్లాలోని ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెం సెంటర్ వద్ద దారుణం జరిగింది.

నెల్లూరులో దారుణం

నెల్లూరు: జిల్లాలోని ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెం సెంటర్ వద్ద దారుణం జరిగింది. నెల్లూరుకు చెందిన సుబ్బులు అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నిప్పు పెట్టుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటనలో తల్లి సుబ్బులు (27), కుమార్తె మధురవాణి (5) మృతి చెందగా....నిప్పు చూసి తప్పించుకొని పారిపోవడంతో  కుమారుడు మహేష్  ప్రాణాలు దక్కించుకున్నాడు. కుమారుడు ఇచ్చిన సమాచారంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుబ్బులు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Updated Date - 2021-04-23T13:22:44+05:30 IST