ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ముగ్గురు దుర్మరణం
ABN , First Publish Date - 2021-05-11T16:36:49+05:30 IST
జిల్లాలోని వింజమూరు మండలం చంద్రపడియాలోని ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ముగ్గురు దుర్మరణం చెందారు.
నెల్లూరు: జిల్లాలోని వింజమూరు మండలం చంద్రపడియాలోని ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ముగ్గురు దుర్మరణం చెందారు. చంద్రపడియాలోని వెంకటనారాయణ యాక్టివ్ ఇంగ్రిడియంట్స్లో రియాక్టర్ లోనికి వెళ్లే గ్యాస్ పైప్ లీక్ అవడంతో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. గత ఏడాది ఇదే ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే.