Nellore: కోడలిని వేధింపులకు గురిచేసిన వైసీపీ నేత

ABN , First Publish Date - 2022-04-11T15:29:24+05:30 IST

జిల్లాలోని కావలిలో దారుణం జరిగింది. వైసీపీ నేత, ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు షాహుల్ హమీద్, ఆయన కుటుంబ సభ్యుల ఘాతుకానికి పాల్పడ్డాడు.

Nellore: కోడలిని వేధింపులకు గురిచేసిన వైసీపీ నేత

నెల్లూరు: జిల్లాలోని కావలిలో దారుణం జరిగింది. వైసీపీ నేత, ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు షాహుల్ హమీద్, ఆయన కుటుంబ సభ్యుల ఘాతుకానికి పాల్పడ్డాడు. కోడలిని తీవ్ర వేధింపులకు గురిచేయడంతో పాటు... ఇరవై రోజులు పాటు ఇంట్లో నిర్భంధించారు. ఆపై కోడలిని కొట్టి ఇంట్లో నుంచి తరిమేశారు. అయితే తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు దిశా యాప్‌ను ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. బాధితురాలి తండ్రి హెడ్ కానిస్టేబుల్ అయినప్పటికీ పోలీసులు కనికరించలేదు. వైసీపీ నేత, ఆయన కుటుంబ సభ్యులకే పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. 

Updated Date - 2022-04-11T15:29:24+05:30 IST