మహిళ మెడపై కాలుతో తొక్కి చంపేందుకు వైసీపీ నేత యత్నం
ABN , First Publish Date - 2022-04-22T14:42:26+05:30 IST
జిల్లాలోని కలిగిరి మండలం కుమ్మరకొండూరు గ్రామంలో వైసీపీ నేత దాష్టికం బయపటడింది.
నెల్లూరు: జిల్లాలోని కలిగిరి మండలం కుమ్మరకొండూరు గ్రామంలో వైసీపీ నేత దాష్టికం బయపటడింది. మహిళను కిందపడేసి మెడపై కాలు వేసి తొక్కి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. చల్ల సుభరత్నమ్మ, చల్ల మహేష్ మధ్య గత కొద్ది సంవత్సరాలుగా కోర్టులో భూవివాదం పెండింగ్లో ఉంది. ఈక్రమంలో కోర్టులో ఉన్న స్థలాన్ని జేసీబీతో అర్ధరాత్రి 2 గంటల సమయంలో చదును చేస్తున్న మహేష్ను సుభరత్నమ్మ అడ్డుకుంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మహేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధిత మహిళ ప్రస్తుతం కావలి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.