Nellore: అందరూ చూస్తుండగా వివాహితపై దారుణం

ABN , First Publish Date - 2022-03-22T18:12:49+05:30 IST

జిల్లాలోని సంగం మండలం పెరమన గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వివాహితపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

Nellore: అందరూ చూస్తుండగా వివాహితపై దారుణం

నెల్లూరు: జిల్లాలోని సంగం మండలం పెరమన గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వివాహితపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన మహిళ పంట పొలాల్లో పశువులు కాస్తుండగా నాటుసారా బట్టీల వద్ద పట్టపగలే అందరూ చూస్తుండగా కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసిన వ్యక్తి స్థానిక వైసీపీ నాయకుల అండ చూసుకొని ఈ ఘటనకు పాల్పడ్డాడంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై బాధితురాలు భయంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయని పరిస్థితి నెలకొంది. 

Updated Date - 2022-03-22T18:12:49+05:30 IST