AP News: మైపాడు రోడ్డులో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-08-16T14:51:51+05:30 IST
జిల్లాలోని మైపాడు రోడ్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాలువ పక్కన ఉండే ఇళ్లను తొలగించేందుకు అధికారులు యత్నించారు.
నెల్లూరు: జిల్లాలోని మైపాడు రోడ్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాలువ పక్కన ఉండే ఇళ్లను తొలగించేందుకు అధికారులు యత్నించారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ఇళ్లను తొలగిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను ఎలా కూల్చుతారంటూ స్థానికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. వరదొస్తే మునిగిపోయే జగనన్న ఇళ్ల స్థలాల్లో ఎలా ఉండాలని నిలదీశారు.