వివాదంలో నెల్లూరు జాయింట్ కలెక్టర్ భార్య

ABN , First Publish Date - 2021-03-04T19:14:31+05:30 IST

జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో అంగర్ వాడీ వర్కర్లతో పనులు చేయిస్తున్నట్లు..

వివాదంలో నెల్లూరు జాయింట్ కలెక్టర్ భార్య

నెల్లూరు: జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో అంగర్ వాడీ వర్కర్లతో పనులు చేయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగం ఇచ్చినందుకు రూ. మూడున్నర లక్షలు ఇవ్వాలని జేసీ భార్య శ్రీలక్ష్మి డిమాండ్ చేశారని అంగన్ వాడి వర్కర్ రెహానా అనే ముస్లిం మహిళ నెల్లూరు 5వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ముస్లిం, దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఫిర్యాదులో జేసీ భార్య పేరులేదని సీఐ చెబుతుండగా... ఫిర్యాదును పోలీసులు మార్చేశారని ముస్లిం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


ఉద్యోగం ఇచ్చినందుకు మూడున్నర లక్షలు డిమాండ్ చేశారని, రూ. 2 లక్షలు ఇచ్చానని రెహానా చెప్పారు. మిగిలిన లక్షన్నర ఇవ్వకపోవడంతో తమ ఇంట్లో చోరీ జరిగినట్లు పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై ముస్లిం సంఘాల నేతలు మండిపడుతున్నారు. జేసీ భార్య లక్షన్నర చోరీ అయినట్లు ఫిర్యాదు ఇచ్చారని చెబుతున్న పోలీసులు.. జేసీ ఇంట్లో అంత డబ్బు ఎందుకు ఉందనే దానిపై దర్యాప్తు ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. ఈ లెక్కన జేసీ పరిధిలో ఎంతగా అవినీతి జరుగుతుందో తేల్చాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2021-03-04T19:14:31+05:30 IST