Nellore: ప్రశ్నించిన రిపోర్టర్‌పై చిందులు వేసిన మంత్రి Ambati

ABN , First Publish Date - 2022-05-09T21:50:31+05:30 IST

Nellore: మంత్రి అంబటి రాంబాబు సోమవారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు.

Nellore: ప్రశ్నించిన రిపోర్టర్‌పై చిందులు వేసిన మంత్రి Ambati

Nellore: మంత్రి అంబటి రాంబాబు సోమవారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. సంగం బ్యారేజి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంగం బ్యారేజి పనులు త్వరలోనే పూర్తి చేసి సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని అన్నారు. అయితే అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి చేయకుండా సంగం బ్యేరేజు పనులు పూర్తి చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని ప్రశ్నించిన ఓ మీడియా ప్రతినిధిపై మంత్రి Ambati చిందులు తొక్కారు. ‘నువ్వు ప్రశ్నలు వేస్తున్నావా? ఉపన్యాసమిస్తున్నావా?’ అంటూ వెటకారంగా మాట్లాడారు. చివరికి ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.

Read more