టీడీపీ శ్రేణులపై కొనసాగుతున్న వైసీపీ వేధింపులు

ABN , First Publish Date - 2022-01-09T17:08:08+05:30 IST

వైసీపీ అరాచకాలను అడ్డుకుంటున్న టీడీపీ శ్రేణులపై వేధింపులు, కేసుల పరంపర కొనసాగుతోంది.

టీడీపీ శ్రేణులపై కొనసాగుతున్న వైసీపీ వేధింపులు

నెల్లూరు: వైసీపీ అరాచకాలను అడ్డుకుంటున్న టీడీపీ శ్రేణులపై వేధింపులు, కేసుల పరంపర కొనసాగుతోంది. తాజాగా నెల్లూరు టీఎన్ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు అలీఖాన్‌తో సహా ముగ్గురు కార్యకర్తలపై పోలీసులు అట్రాసిటీ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నక్కా గోపాల్ నగర్‌లో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలపై వైసీపీ నేతలు  దౌర్జన్యానికి దిగారు. తిరిగి బాధితులపైనే కేసులు పెట్టారు. వైసీపీ నేతలకు వ్యతిరేకంగా అలీఖాన్ పోరాటం చేస్తున్నారు. దీంతో ఆయనపై కక్ష కట్టిన వైసీపీ నేతలు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారు. నెల్లూరులో తమ కార్యకర్తల అరెస్టుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-01-09T17:08:08+05:30 IST