నెల్లూరు జిల్లా: కావలిలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు

ABN , First Publish Date - 2022-03-03T17:24:05+05:30 IST

నెల్లూరు జిల్లా: కావలిలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. గూండాల్లా మారిపోయారు.

నెల్లూరు జిల్లా: కావలిలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు

నెల్లూరు జిల్లా: కావలిలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. గూండాల్లా మారిపోయారు. అధికారపార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాశారనే అక్కసుతో ఓ పత్రికా కార్యాలయానికి వెళ్లి సీనియర్ జర్నలిస్టు ఓలేటి నాగేశ్వరరావుపై దాడికి తెగబడ్డారు. వైసీపీ గూండాగిరిపై కావలి భగ్గుమంటోంది. డీఎస్సీ కార్యాలయం ఎదుట వివిధ పార్టీల నేతలు, ఆర్య వైశ్య సంఘాల నేతలు ధర్నా, రాస్తారోకో చేశారు. దీంతో పోలీసులు దాడి కేసు నమోదు చేశారు. అటు అధికార పార్టీ ఇచ్చిన పోటీ ఫిర్యాదుతో బాధితుడిపై అట్రాసిటీ కేసు పెట్టడం దుమారం రేపుతోంది. నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారంటూ ఆర్య, వైశ్య సంఘాలు ఆరోపించాయి. కావలిలో గురువారం వ్యాపార సంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి.

Updated Date - 2022-03-03T17:24:05+05:30 IST