AP News: బీరాపేరు వంతెన వద్ద రైతులు ఆందోళన
ABN , First Publish Date - 2022-09-01T15:41:47+05:30 IST
జిల్లాలోని సంగం ఇసుక రీచ్ వెళ్ళే రహదారిపై బీరాపేరు వంతెన వద్ద రైతులు ఆందోళనకు దిగారు.
నెల్లూరు: జిల్లాలోని సంగం ఇసుక రీచ్ వెళ్ళే రహదారిపై బీరాపేరు వంతెన వద్ద రైతులు ఆందోళనకు దిగారు. భారీ ఇసుక వాహనాలతో పోలాలకు వెళ్ళే రహదారులు దెబ్బ తింటున్నాయంటు రైతులు ఆరోపిస్తున్నారు. ఇసుక వాహనాలు వెళ్ళకుండ రోడ్డుకు అడ్డంగా సవకలు కట్టివేసి నిరసన తెలిపారు. పెన్నా పోర్లు కట్టలను కూడా తవ్వేస్తుండటంతో తమ పొలాలు దెబ్బతింటున్నాయని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు.