Nellore: ఫ్యాన్‎కి ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-27T14:38:30+05:30 IST

జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కావలి ముసునూరు రెడ్డిగుంట కాలనీలో వివాహిత ఈడింపల్లి దొరసానమ్మ (53) ఫ్యాన్‎కి ఉరి

Nellore: ఫ్యాన్‎కి ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

నెల్లూరు: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కావలి ముసునూరు రెడ్డిగుంట కాలనీలో వివాహిత ఈడింపల్లి దొరసానమ్మ (53) ఫ్యాన్‎కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రెడ్డిగుంట కాలనీలో కలకలం రేపుతోంది. భార్యాభర్తల మధ్య వివాదంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. రెండు రోజుల క్రితం దంపతులు మధ్య తీవ్ర ఘర్షణ జరిగినట్లు సమాచారం స్థానికులు చెబుతున్నారు. ఘర్షణ అనంతరం పుట్టింటికి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. వివాహిత ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-08-27T14:38:30+05:30 IST