నెల్లూరులో తల్లీకూతుళ్ల ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-04-28T16:25:50+05:30 IST

జిల్లాలోని వాకాడులో తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు.

నెల్లూరులో తల్లీకూతుళ్ల ఆత్మహత్య

నెల్లూరు: జిల్లాలోని వాకాడులో తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. అశోక్ పిల్లర్ సెంటర్ ప్రాంతంలో తమ ఇంట్లోనే త‌ల్లి షాకీరమ్మ, కుమార్తె మక్భుల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా ఇరువురి ఆత్మహత్యలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షాకీర‌మ్మ‌ కుటుంబం టిఫిన్ సెంట‌ర్ నిర్వ‌హిస్తూ జీవిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-04-28T16:25:50+05:30 IST