నెల్లూరులో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-03-17T17:54:12+05:30 IST

నెల్లూరు: నగరంలో ఉద్రిక్తత నెలకొంది. దామోదర్ సంజీవయ్య విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రైవేటు పరం చేయడంపై..

నెల్లూరులో ఉద్రిక్తత

నెల్లూరు: నగరంలో ఉద్రిక్తత నెలకొంది. దామోదర్ సంజీవయ్య విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రైవేటు పరం చేయడంపై ప్రతిపక్షాలు ఉద్యమించాయి. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించాయి. రాజకీయాలకు అతీతంగా ప్రజలు భారీగా తరలివచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, జెన్కో ఉద్యోగులు.. కలెక్టరేట్ ఎదుట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

Updated Date - 2022-03-17T17:54:12+05:30 IST