Nellore: ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్... వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-04-27T15:03:56+05:30 IST

జిల్లాలోని రాపూరు మండలం భోజనపల్లి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు.

Nellore: ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్... వ్యక్తి మృతి

నెల్లూరు: జిల్లాలోని రాపూరు మండలం భోజనపల్లి వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్టర్‌ను వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బైక్‌పై ఉన్న నాగురు మురళి(25) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తిరుపతి జిల్లా పేరురు వాసిగా గుర్తించారు. పొదలకూరు నుంచి తిరుపతికి వెళ్తుండగా భోజనపల్లి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


Updated Date - 2022-04-27T15:03:56+05:30 IST