నెల్లూరులో ఇరిగేషన్ ఆఫీస్ ఎదుట టీడీపీ ఆందోళన

ABN , First Publish Date - 2021-06-24T19:00:06+05:30 IST

నగరంలోని ఇరిగేషన్ కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.

నెల్లూరులో ఇరిగేషన్ ఆఫీస్ ఎదుట టీడీపీ ఆందోళన

నెల్లూరు:  నగరంలోని ఇరిగేషన్ కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారాన్ని ఇరిగేషన్ ఎస్ఈ దృష్టికి   తీసుకెళ్లారు. అనంతరం  కోటంరెడ్డి మాట్లాడుతూ... వెంకటేశ్వపురంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రశ్నిస్తుంటే అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. ఇరిగేషన్ అధికారులపై న్యాయ పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగితే అధికారుల కళ్ళకి కనిపించడం లేదన్నారు. వైసీపీ నేతలు రూ.100 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. సహకరించిన అధికారులు జైలుకి వెళ్లక తప్పదని హెచ్చరించారు. జగన్ రెడ్డి కన్నా రాష్ట్రంలో ఎవ్వరు అవినీతి పరులు లేరని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. 

Updated Date - 2021-06-24T19:00:06+05:30 IST