Ycp ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోయింది: Ramakrishna

ABN , First Publish Date - 2022-07-18T01:24:16+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు (Ycp Mlas) గ్రాఫ్ (Graph) పడిపోయిందని రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ (K Ramakrishna) అన్నారు. ..

Ycp ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోయింది: Ramakrishna

నెల్లూరు (Nellore): రాష్ట్రంలో వైసీపీ  ఎమ్మెల్యేలు (Ycp Mlas) గ్రాఫ్ (Graph) పడిపోయిందని రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ (K Ramakrishna) అన్నారు. సీపీఐ (Cpi) ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్లీనరీ (Plenary) సమావేశంలో రాష్ట్ర, దేశ సమస్యలు గానీ చర్చకి తేవకపోవడం వైసీపీకే చెల్లిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. ఒక్క గుంత కూడా పూడ్చలేని పరిస్థితికి జగన్ ప్రభుత్వం (Jagan Government) వచ్చేసిందన్నారు. రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిన సీఎం.. రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధి చేశాడా? అని.. ఒక్క ప్రాజెక్ట్ కట్టాడా? అని ప్రశ్నించారు. రెండు లక్షల మంది ప్రజలు నీటిలో మునిగిపోతే, వారి గురించి పట్టించుకునే నాధుడు లేడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. 

Updated Date - 2022-07-18T01:24:16+05:30 IST