టీడీపీ నేతల పుట్టినరోజు వేడుకలు
ABN , First Publish Date - 2022-07-02T03:30:24+05:30 IST
కందుకూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆపార్టీ నాయకుల పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. పార్టీ ని
కందుకూరు, జూలై 1: కందుకూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆపార్టీ నాయకుల పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఈ వేడుకలకు హాజరై, జన్మదినో త్సవం జరుపుకుంటున్న పార్టీ నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి గోచిపాతల మోషే, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి చదలవాడ కొండయ్య, వలేటివారిపాలెం మండలం పోకూరుకి చెందిన పార్టీ కార్యకర్త ఎండ్లూరి పుల్లయ్యలతో కేకు కట్ చేయించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి సత్కరించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల పార్టీ నాయకులు పాల్గొన్నారు.