ఏయూను సందర్శించిన నెదర్లాండ్స్‌ ప్రతినిధులు

ABN , First Publish Date - 2022-08-19T06:41:54+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని నెదర్లాండ్స్‌లోని వాగెనింగెస్‌ విశ్వవిద్యాలయం అకౌంట్‌ మేనేజర్‌ (ఏసియా) జి.కల్యాణ చక్రవర్తి సందర్శించారు.

ఏయూను సందర్శించిన నెదర్లాండ్స్‌ ప్రతినిధులు
ఏయూ వీసీతో నెదర్లాండ్స్‌ ప్రతినిధి కల్యాణ చక్రవర్తి తదితరులు

ఏయూ క్యాంపస్‌, ఆగస్టు 18: ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని నెదర్లాండ్స్‌లోని వాగెనింగెస్‌ విశ్వవిద్యాలయం అకౌంట్‌ మేనేజర్‌ (ఏసియా) జి.కల్యాణ చక్రవర్తి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వీసీ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఆహార, వ్యవసాయ రంగాలలో సంయుక్త పరిశోధనలు జరిపే దిశగా ప్రాథమిక చర్చలు జరిగాయి. పరిశోధన, ఇన్నోవేషన్‌ రంగాల్లో కలిసి పనిచేయాలని, ఏయూలో నూతనంగా నెలకొల్పుతున్న ఫుడ్‌ టెస్టింగ్‌ లేబొరేటరీలో భాగస్వామ్యం కావాలని వీసీ కోరారు.


సిజెంట ఫౌండేషన్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌. భాస్కరరెడ్డి కూడా వీసీతో సమావేశమయ్యారు. వ్యవసాయరంగంలో పనిచేస్తున్న తమ సంస్థ కార్యకలాపాలు, ఏయూతో భాగస్వామ్యం చేయడానికి అనువైన పరిస్థితులు తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌, ఆచార్య రవి ఈశ్వరపు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-19T06:41:54+05:30 IST