నేతిలి పకోడీ

ABN , First Publish Date - 2020-06-06T18:15:33+05:30 IST

నేతిలి(నెత్తళ్లు) చేపలు - అరకేజీ, పచ్చిమిర్చి - ఐదారు, నూనె - వేగించడానికి సరిపడా, కొత్తిమీర - ఒక కట్ట, పుదీనా - ఒక కట్ట, కరివేపాకు

నేతిలి పకోడీ

కావలసినవి: నేతిలి(నెత్తళ్లు) చేపలు - అరకేజీ, పచ్చిమిర్చి - ఐదారు, నూనె - వేగించడానికి సరిపడా, కొత్తిమీర - ఒక కట్ట, పుదీనా - ఒక కట్ట, కరివేపాకు - కొద్దిగా, జీలకర్రపొడి - అర టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, నిమ్మకాయలు - రెండు, మిరియాల పొడి - కొద్దిగా.


తయారీ: కొత్తిమీర, పుదీనా, కొన్ని పచ్చిమిర్చిని పేస్టులా చేసుకోవాలి. నేతిలి చేపలను శుభ్రం చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. తరువాత అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్టు వేయాలి. కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, తగినంత ఉప్పు, జీలకర్రపొడి, ధనియాల పొడి వేసి, నిమ్మరసం పిండి బాగా కలపాలి. ఇప్పుడు ఒక కప్పు సెనగపిండి, అరకప్పు బియ్యప్పిండి వేసి చేపలకు బాగా పట్టేలా కలపాలి. స్టవ్‌పై పాత్రపెట్టి నూనె పోసి బాగా వేడి అయ్యాక నేతిలి చేపల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ నూనెలో వేగించాలి. మిరియాల పొడి వేసుకొని సర్వ్‌ చేసుకుంటే నేతిలి చేపల పకోడీ టేస్టీగా ఉంటుంది.

Updated Date - 2020-06-06T18:15:33+05:30 IST