మంత్రి పదవి కావాలని ఏనాడు అడుగలేదు: ఛీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి
ABN , First Publish Date - 2022-04-07T22:43:36+05:30 IST
తనకు మంత్రి పదవి కావాలని సీఎం జగన్ రెడ్డిని ఏనాడు
కడప: తనకు మంత్రి పదవి కావాలని సీఎం జగన్ రెడ్డిని ఏనాడు తాను అడుగలేదని, అలాగే కోరలేదని ప్రభుత్వ ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కేబినెట్ విస్తరణపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ABNతో శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ తనకు పదవి అవసరం లేదన్నారు. ప్రభుత్వ ఛీఫ్ విప్ పదవిని కూడా తాను అడగకుండా జగన్ ఇచ్చారన్నారు. పదవి లేకున్నా కూడా ప్రజాసేవ చేసినప్పుడే ప్రజాభిమానం పొందుతామన్నారు. మంత్రి పదవుల విషయంలో అందరికి అవకాశం కల్పించాలనేదే జగన్ రెడ్డి ఉద్దేశమన్నారు. జరగబోయే కేబినెట్ మంత్రివర్గ విస్తరణలో అన్ని సామాజిక వర్గాలకు జగన్ సమన్యాయం చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. పదవులకన్నా పార్టీ ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. మంత్రి పదవులు రానివారు సంతృప్తి చెందాల్సిన అవసరం లేదని ABNతో ఆయన పేర్కొన్నారు.