హర్యానా సీఎంకు తలంటిన అమిత్ షా!

ABN , First Publish Date - 2020-11-30T00:20:39+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు చేస్తున్న ‘చలో ఢిల్లీ’ ఆందోళనపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్

హర్యానా సీఎంకు తలంటిన అమిత్ షా!

హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు చేస్తున్న ‘చలో ఢిల్లీ’ ఆందోళనపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి అమిత్ షా పరోక్షంగా తప్పుబట్టారు. రైతుల ఆందోళన రాజకీయ ప్రేరేపితమని, వారిలో ఖలిస్థాన్ ఉగ్రవాదులు ఉన్నట్టు తమకు ఇంటెలిజెన్స్ సమాచారం అందిందని ఖట్టర్ నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులను ఉగ్రవాదులుగా పోల్చుతారా? అంటూ ఖట్టర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. 


జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రైతుల ఆందోళనపై మాట్లాడారు. రైతుల ఆందోళనను రాజకీయ ప్రేరేపితమని తానెప్పుడూ చెప్పలేదని, ఇప్పుడు కూడా ఆ మాట అనడం లేదని పేర్కొన్నారు. రైతుల మార్చ్ రాజకీయ ప్రేరేపితమన్న హర్యానా సీఎం వ్యాఖ్యలను ఉద్దేశించే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.  

Updated Date - 2020-11-30T00:20:39+05:30 IST