Coal Smuggling Case: మమతాబెనర్జీకి తలనొప్పి...మరో టీఎంసీ మంత్రికి ఈడీ సమన్లు
ABN , First Publish Date - 2022-09-01T18:14:39+05:30 IST
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ(Mamata Banerjee) నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (Enforcement Directorate)...
కోల్కతా(పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ(Mamata Banerjee) నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (Enforcement Directorate) నుంచి తలనొప్పి తగ్గడం లేదు.బొగ్గు కుంభకోణం కేసులో(Coal Smuggling Case) టీఎంసీకి చెందిన మరో మంత్రి (cabinet minister)మోలాయ్ ఘటక్ కు ఈడీ తాజాగా సమన్లు(ED summons) జారీ చేసింది.
మంత్రి మోలాయ్ తో పాటు టీఎంసీ ఎమ్మెల్యే(Trinamool Congress MLA) మహతోకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది.ఇప్పటికే మరోసారి అభిషేక్ బెనర్జీని ఈడీ విచారించాలని నిర్ణయించింది. మంత్రి మోలాయ్ గతంలో విచారణలో వివరాలు చెప్పక పోవడంతో అతన్ని మరోసారి విచారించాలని ఈడీ నిర్ణయించింది.