లుంబినీ, ఎన్టీఆర్ గార్డెన్కు కొత్త అందాలు
ABN , First Publish Date - 2022-06-27T14:27:12+05:30 IST
హుస్సేన్సాగర్ తీరాన గల లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్లకు కొత్త సొబగులు రానున్నాయి. నగర పర్యాటకులను ఆకర్షిస్తున్న
హైదరాబాద్ సిటీ: హుస్సేన్సాగర్ తీరాన గల లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్లకు కొత్త సొబగులు రానున్నాయి. నగర పర్యాటకులను ఆకర్షిస్తున్న ఆయా పార్కులను సరికొత్తగా తీర్చిదిద్ధేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. లుంబినీపార్కు స్థలంలోనే తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని దీపం ఆకారంలో పెద్దఎత్తున నిర్మాణం చేపడుతున్నారు. ఎన్టీఆర్ గార్డెన్లో 125అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆయా పార్కుల సమీపంలో నిర్మాణమవుతున్న ప్రఖ్యాతి కట్టడాలను స్ఫూర్తించేలా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్కిటెక్చర్ను నియమించేందుకు హెచ్ఎం డీఏ టెండర్లను ఆహ్వానించింది. అమరవీరుల స్తూపాన్ని ఆధారంగా చేసుకొని లుంబినీ పార్కు పరిసర ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దనున్నారు. అంబేడ్కర్ విగ్రహానికి, ఎన్టీఆర్ గార్డెన్ పరిసర ప్రాంతానికి కనెక్టివిటీ ఉండేలా వివిధ రకాల మొక్కలు, కట్టడాలతో మరింత మెరుగులు అద్దనున్నారు.