మరీ ఇంత క్రూరమా..? రెండ్రోజుల క్రితం పుట్టిన పాప.. పొట్టకు రాయిని కట్టి మరీ నదిలో పారేసిన కర్కశులు.. చివరకు..

ABN , First Publish Date - 2021-12-29T21:42:06+05:30 IST

పురిట్లోనే ఆడ పిల్లలను చంపేస్తున్న ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

మరీ ఇంత క్రూరమా..? రెండ్రోజుల క్రితం పుట్టిన పాప.. పొట్టకు రాయిని కట్టి మరీ నదిలో పారేసిన కర్కశులు.. చివరకు..

పురిట్లోనే ఆడ పిల్లలను చంపేస్తున్న ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హర్యానాలో అలాంటిదే ఓ క్రూర ఘటన వెలుగు చూసింది. ఓ కాలువలో ఓ పాప మృతదేహం స్థానికులకు దొరికింది. పాప పొట్టకు రాయి కట్టి మరీ ఎవరో కాలువలో పడేశారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హర్యానాలోని రేవారిలో ఈ ఘటన జరిగింది. 


రేవరిలోని కోస్లి బైపా‌స్‌కు సమీపంలో ఉన్న పంట కాలవలో మంగళవారం మధ్యాహ్నం ఓ చిన్న పాప మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆ పాప పొట్టకు రాయి కట్టేసి ఉంది. ఆ పాప వయసు రెండ్రోజులు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో ఎవరో ఈ పని చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ చిన్నారిని హత్య చేసిన వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-12-29T21:42:06+05:30 IST