నవ వధువు ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-11-29T05:48:55+05:30 IST
నంద్యాల టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని గిరినాథ్ సెంటర్లో నివాసం ఉంటున్న నవ వధువు ఆదివారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
నంద్యాల(నూనెపల్లె), నవంబరు 28: నంద్యాల టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని గిరినాథ్ సెంటర్లో నివాసం ఉంటున్న నవ వధువు ఆదివారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పాణ్యంకు చెందిన నజీర్బాషా కుమార్తె షబానా (31)ని నంద్యాల పట్టణం గిరినాథ్ సెంటర్కు చెందిన షేక్ మహమ్మద్ జుబేర్కు 28 రోజుల క్రితం ఇచ్చి పెద్దలు వివాహం చేశారు. భర్త జుబేర్ గిరినాథ్ సెంటర్లో ఆన్లైన్ సర్వీసెస్, జిరాక్స్ సెంటర్ నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. కింది పోర్షన్లో జుబేర్ తల్లిదండ్రులు, మొదటి అంతస్తులో జుబేర్, షబానా దంపతులు నివాసం ఉంటున్నారు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో షబానా ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అప్పుడే వచ్చిన భర్త జుబేర్ వెంటనే కిందకు దించి నంద్యాల ప్రభుత్వ ఆస్ప్రతికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షబానా ఆదివారం కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తండ్రి నజీర్ బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.