కొత్త కరోనా కేసులు 147

ABN , First Publish Date - 2021-09-30T06:22:17+05:30 IST

జిల్లాలో మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 147 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

కొత్త కరోనా కేసులు 147

తిరుపతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 147 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే వ్యవధిలో కరోనాతో ఐదుగురు మృతిచెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 243708కు, కొవిడ్‌ మరణాలు 1910కి చేరాయి. యాక్టివ్‌ కేసులు 1722గా ఉన్నాయి. తాజా కేసులు.. తిరుపతి అర్బన్‌లో 25, తిరుపతి రూరల్‌ 19, పీలేరు 16, మదనపల్లె 15, చిత్తూరు 16, చంద్రగిరి 8, కలికిరి 6, బైరెడ్డిపల్లె, పూతలపట్టు మండలాల్లో 5 చొప్పున, నగరి, రొంపిచెర్ల 4, రేణిగుంట, వరదయ్యపాళెం మండలాల్లో 3 వంతున, వాల్మీకిపురం, పెనుమూరు, వెదురుకుప్పం, కురబలకోట మండలాల్లో 2చొప్పున, బంగారుపాళ్యం, వి.కోట, పాకాల, ఏర్పేడు, కంభంవారిపల్లె, తవణంపల్లె, కలకడ, చౌడేపల్లె, గంగవరం, శ్రీకాళహస్తి మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి. 

Updated Date - 2021-09-30T06:22:17+05:30 IST