చంద్రబాబు ఫిర్యాదుపై రాష్ట్రపతి ఏమన్నారంటే...
ABN , First Publish Date - 2021-10-25T20:13:06+05:30 IST
టీడీపీ ఫిర్యాదుపై రామ్నాథ్ కోవింద్ సానుకూలంగా స్పందించారు. ఏపీలో పరిస్థితిపై వాకబు చేస్తాన్నారు.
న్యూఢిల్లీ: చంద్రబాబు బృందం సోమవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసింది. ఆంధ్రప్రదశ్లో పరిస్థితిపై వివరించారు. టీడీపీ ఫిర్యాదుపై రామ్నాథ్ కోవింద్ సానుకూలంగా స్పందించారు. ఏపీలో పరిస్థితిపై వాకబు చేస్తామన్నారు. టీడీపీ నేతలు చెప్పినవన్నీ చాలా సీరియస్ అంశాలని అన్నారు. వీటన్నింటినీ పరిశీలనకు తీసుకుంటామన్నారు.
అమరావతి రాజధాని ఏమైందని టీడీపీ బృందాన్ని రాష్ట్రపతి ప్రశ్నించారు. అమరావతిని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేశారని చంద్రబాబు వివరించారు. అలాగే రాష్ట్రపతికి రాజమండ్రి శిరోముండనం కేసు విషయం వివరించారు. ‘మీరు ఆదేశించినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని’ రాష్ట్రపతికి టీడీపీ బృందం తెలిపింది.