‘పుర’ పోరులో కొత్త ముఖాలు
ABN , First Publish Date - 2021-04-24T05:04:01+05:30 IST
నాగర్కర్నూల్ జిల్లా అచ్చం పేట మునిసిపల్ ఎన్నికల బరిలో కొత్త వారు పోటీకి దిగారు.
అచ్చంపేట ఏప్రిల్ 23 : నాగర్కర్నూల్ జిల్లా అచ్చం పేట మునిసిపల్ ఎన్నికల బరిలో కొత్త వారు పోటీకి దిగారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుం చి కొంత మంది పాత వారికే అవకాశం ఇచ్చిన, చాలా వార్డుల్లో కొత్త అభ్యర్థులు రంగంలోకి దిగారు. అందులో బీజేపీలోనే ఎక్కువ మొత్తంలో కొత్తగా పోటీ చేస్తున్న వా రు, తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నా రు. ఈ నేపథ్యంలో వారి రాజకీయ భ విష్యత్తు ఎలా ఉండబోతుందో అనే ఆలోచన లో పడ్డారు. సీనియర్ నాయకుల సూచనలు, సలహాల తో రాజకీయ ప్రచారానికి పదును పెడుతున్నారు. మొ త్తం 66 మంది 20 వార్డుల్లో పోటీలో నిలిచారు. ఒక్కో వార్డుకు మూడు పా ర్టీల నుంచి ఢీ అంటే ఢీ అనే విధంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. టీఆర్ ఎస్ అభ్యర్థుల తరపున ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మునిసిపల్ మాజీ చైర్మన్ తులసీరాం ప్రచారం చేస్తుండగా, కాంగ్రెస్ తరపున డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వై.శ్రీని వాసులు ప్రచారంలో పాల్గొంటే, బీజేపీ అభ్యర్థుల గె లుపు కోసం జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్రా వు, రాష్ట్ర నాయకులు నరేందర్రావు, సుధాక ర్రెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు.
గట్టెక్కగలమనే ధీమాతో..
టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ కౌన్సిలర్లకే మళ్లీ అవకాశం రాగా, వారిపై గతంలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు ఈసారైనా విజయం సాధించక పోతామా అనే ధీమాతో ఉన్నారు. సానుభూతితో ఓట్లను రాబట్టేందుకు ప్ర యత్నాలు చేసుతన్నారు. కాగా, ఓటర్లు తమ వైపే మొగ్గు చూపే అవకా శాలు ఉన్నాయని బీజేపీ వారు ప్రచారం ఉధృతం చేశారు.