ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతుల ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-07-01T18:09:04+05:30 IST
అనంతపురం: ధర్మవరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అనంతపురం: ధర్మవరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మున్సిపల్ కార్మికుడు శివ(23), గౌతమి(21) ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నారు. గౌతమి నిన్న అర్ధరాత్రి సమయంలో తన పుట్టింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న శివ భార్య మరణాన్ని జీర్ణించుకోలేక ధర్మవరం ఎర్రగుంటకు సమీపంలో పుట్టపర్తి వెళ్లే రైల్వే ట్రాక్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే వీరి ఆత్మహత్యకు కారణమని బంధువులు చెబుతున్నారు.