త్వరలో అర్హులకు కొత్త పెన్షన్లు: హరీశ్‌రావు

ABN , First Publish Date - 2022-03-18T00:32:31+05:30 IST

త్వరలో అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లను మంజూరు చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గురువారం సిద్దిపేటలోని

త్వరలో అర్హులకు కొత్త పెన్షన్లు: హరీశ్‌రావు

సిద్దిపేట: త్వరలో అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లను మంజూరు చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గురువారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 161 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చేనెలలో అభయహస్తం లబ్ధిదారులకు సంబంధించిన డబ్బులను ప్రభుత్వం వడ్డితో సహా చెల్లిస్తుందని తెలిపారు. అలాగే సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణం చేసుకునే లబ్ధిదారులకు మూడు దఫాల్లో రూ.3 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. తెలంగాణాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులను పెంచి ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పేదింటి ఆడబిడ్డల పెళ్లికోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టారని తెలిపారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని హరీశ్‌రావు తెలిపారు.

Updated Date - 2022-03-18T00:32:31+05:30 IST