Komatireddy RajaGopal Reddy: నా రాజీనామాతోనే కొత్త పింఛన్లు

ABN , First Publish Date - 2022-08-18T23:31:54+05:30 IST

Yadadri : చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, ధర్మభిక్షం గౌడ్ విగ్రహాలకి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి

Komatireddy RajaGopal Reddy: నా రాజీనామాతోనే కొత్త పింఛన్లు

Yadadri : చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, ధర్మభిక్షం గౌడ్ విగ్రహాలకి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Munugodu Ex. MLA Komatireddy Rajagopal Reddy) పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నా రాజీనామాతోనే మునుగోడు నియోజకవర్గంలో గట్టుప్పల్‌ను మండలంగా చేశారు. కొత్త పింఛన్లు మంజూరు చేశారు. రోడ్లు బాగు చేశారు. ఈనెల 21న బీజేపీ (BJP) సభ ఉందని తెలిసినా టీఆర్ఎస్ 20వ తేదీ సభ పెట్టడం దుర్మార్గం. మునుగోడు నియోజకవర్గంలో ఇన్‌చార్జీలుగా నియమితులయిన ఎమ్మెల్యేలు వాళ్ల సొంత నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ చేయడం లేదు. మునుగోడులో జరిగే బీజేపీ సభకు వేల సంఖ్యలో పార్టీ నాయకులు,కార్యకర్తలు వస్తున్నారు’’ అని చెప్పారు. 

Updated Date - 2022-08-18T23:31:54+05:30 IST