వీఐ కొత్త పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లు

ABN , First Publish Date - 2021-04-23T06:33:47+05:30 IST

వొడాఫోన్‌ ఐడియా(వీఐ) వ్యాపారాలు, వృత్తినిపుణుల కోసం కొత్త పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లను ప్రవేశపెట్టింది. వ్యాపార సంస్థలు, ఎస్‌ఎంఈలు, స్టార్ట్‌పలు హైబ్రిడ్‌ పని విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో...

వీఐ కొత్త పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లు

  • రూ.299 నుంచి ప్రారంభం


న్యూఢిల్లీ : వొడాఫోన్‌ ఐడియా(వీఐ) వ్యాపారాలు, వృత్తినిపుణుల కోసం కొత్త పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లను ప్రవేశపెట్టింది. వ్యాపార సంస్థలు, ఎస్‌ఎంఈలు, స్టార్ట్‌పలు హైబ్రిడ్‌ పని విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో ‘వీఐ బిజినెస్‌ ప్లస్‌’ పేరుతో సౌకర్యవంతం, సురక్షితం అయిన విలువ ఆధారిత ప్లాన్లు విడుదల చేసినట్టు తెలిపింది. ఈ ప్లాన్లు రూ.299 నుంచి ప్రారంభం అవుతాయి. కస్టమర్‌ ఎక్కడ నుంచి పని చేస్తున్నాడనే ప్రమేయం లేకుండా వారికి కనెక్టివిటీ కల్పిస్తాయి. కనెక్టివిటీతో పాటుగా మొబైల్‌ సెక్యూరిటీ, లొకేషన్‌ ట్రాకింగ్‌, డేటా పూలిం గ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొంది. లొకేషన్‌ ట్రాకింగ్‌ విధానం ద్వారా తమ క్షేత్రస్థాయి సిబ్బంది ఎక్కడున్నది పర్యవేక్షించుకుంటూ ఉండవచ్చు. 


Updated Date - 2021-04-23T06:33:47+05:30 IST