మూడు రోజులు రిజిస్ట్రేషన్ల్ల నిలిపివేత

ABN , First Publish Date - 2021-02-28T04:59:43+05:30 IST

నగరంలోని నెహ్రూనగర్‌లో ఇరుకుగా ఉన్న జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని బోనకల్‌ రోడ్‌లోని శ్రీరామ్‌హిల్స్‌ కాంప్లెక్స్‌లోకి మారుస్తున్నారు.

మూడు రోజులు రిజిస్ట్రేషన్ల్ల నిలిపివేత
శ్రీరామ్‌హిల్స్‌ కాంప్లెక్స్‌లో కొత్తకార్యాలయం

 ఖమ్మం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం మార్పు

బోనకల్‌ రోడ్‌లోని శ్రీరామ్‌హిల్స్‌ 

కాంప్లెక్స్‌లోకి మారుస్తున్న అధికారులు

ఖమ్మంటౌన్‌, ఫిబ్రవరి27: నగరంలోని నెహ్రూనగర్‌లో ఇరుకుగా ఉన్న జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని బోనకల్‌ రోడ్‌లోని శ్రీరామ్‌హిల్స్‌ కాంప్లెక్స్‌లోకి మారుస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ శనివారం ప్రారంభ మయింది. కార్యాలయం మార్చటంతో మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం నెహ్రూనగర్‌ కార్యాల యంలో ఉన్నవిభాగాలను కొత్తకార్యాలయంలోకి మారుస్తు న్నారు. జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంతో పాటు ఆడిట్‌, చిట్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను బోనకల్‌ రోడ్‌లోని శ్రీరామ్‌హిల్స్‌ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేస్తున్న కొత్త కార్యాల యంలోకి మారుస్తున్నారు. కంప్యూటర్లను, ఇతర సామ గ్రిని శనివారమే తరలించారు. కంప్యూటర్ల అమరిక ఇతరత్రా పనులకు కొంత సమయం పడటంతో మూడురోజులు రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తున్నారు.

ఇరుకుకు చెక్‌

వైరారోడ్‌లోని నెహ్రూనగర్‌లో ప్రస్తుతం ఉన్న సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎంతో ఇరుకుగా ఉండేది. పార్కింగ్‌కు కూడా స్థలం లేని పరిస్థితి. ఇక్కడ ప్రతిరోజు భారీగా రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. వచ్చే ప్రజలు ఇరుకులోనే ఉండాల్సి వచ్చేది. ఇక ఇదే కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం, చిట్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం కూడా ఉన్నాయి. పాతబిల్డింగ్‌లో ఉన్న ఈ కార్యాలయాలు ఇరుకుగా ఉండటమే కాకుండా, కార్యాలయాలకు వచ్చేవారి వాహనాలు ఉంచేందుకు స్థలం కూడా లేదు. ఈ నేపధ్యంలో కార్యాలయాన్ని మార్చటంతో ప్రజలకు ఎంతో వెసులుబాటుగా ఉంటుంది.

Updated Date - 2021-02-28T04:59:43+05:30 IST