వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసులో ఊహించని ట్విస్ట్

ABN , First Publish Date - 2022-04-30T17:36:06+05:30 IST

ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. పోలీస్స్టేషన్లో నిందితులు స్వచ్ఛందంగా లొంగిపోయారు.

వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసులో ఊహించని ట్విస్ట్

ఏలూరు : ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. పోలీస్స్టేషన్లో నిందితులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఈ హత్యను తామే చేశామంటూ సురేష్, మోహన్, హేమంత్లు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. నిందితులు ముగ్గురూ ఎంపీటీసీ సభ్యుడు బజారియా వర్గీయులు కావడం గమనార్హం. హతుడు గంజి ప్రసాద్కు, బజారియాకు మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకవైపు ఈ హత్య.. వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావే చేయించాడంటూ వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే.. మృతుడు గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాగా.. ఆయనపై గ్రామంలోని వైసీపీ కార్యకర్తలంతా మూకుమ్ముడిగా దాడికి పాల్పడిన కొద్ది నిమిషాల్లోనే నిందితులు లొంగిపోవడం గమనార్హం.

Updated Date - 2022-04-30T17:36:06+05:30 IST