‘లా నేస్తం’ చెల్లింపుల్లో కొత్త మెలిక
ABN , First Publish Date - 2021-01-22T09:16:06+05:30 IST
జూనియర్ న్యాయవాదులకు ‘వైఎ స్ఆర్ లా-నేస్తం’ విడుదలలో ప్రభుత్వం కొత్తమెలిక పెట్టింది.
అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): జూనియర్ న్యాయవాదులకు ‘వైఎ స్ఆర్ లా-నేస్తం’ విడుదలలో ప్రభుత్వం కొత్తమెలిక పెట్టింది. ఇప్పటి వరకు లానేస్తం నిధులను న్యాయశాఖ ద్వారా చెల్లిస్తూ వచ్చారు. 2020-21 నుంచి ఉపకారవేతనం(స్టయిఫండ్) నిధులను సాంఘిక, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా విడుదల చేయాలంటూ ప్రభుత్వం ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది. దీనికిగాను ఈ-ప్రగతి సీఈవో, సీఎ్ఫఎంఎస్ అర్హుల జాబితాలను ఆయా శాఖలకు పంపాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది. 2021 జనవరి నుంచి వైఎ్సఆర్ లా-నేస్తంకు ఆయా సంక్షేమ శాఖల నుంచే నేరుగా నిధులు చెల్లించాలని న్యాయశాఖ కార్యదర్శి సునీత గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటికే ఆయా కార్పొరేషన్ల నిధులను రుణాలు ఇచ్చేందుకు కాకుండా సంక్షేమ పథకాలకు మళ్లించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.