Keralaలో న్యూరో వైరస్‌

ABN , First Publish Date - 2021-11-25T18:37:34+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని ఊపిరి పీ ల్చుకుంటున్న తరుణంలోనే పొరుగురాష్ట్రం కేరళలో న్యూరో వైరస్‌ కేసులు పెరుగుతుండడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రత్యేకించి సరిహద్దు జిల్లాలై

Keralaలో న్యూరో వైరస్‌

               - సరిహద్దు జిల్లాలను అప్రమత్తం చేసిన ఆరోగ్యశాఖ 


బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని ఊపిరి పీ ల్చుకుంటున్న తరుణంలోనే పొరుగురాష్ట్రం కేరళలో న్యూరో వైరస్‌ కేసులు పెరుగుతుండడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రత్యేకించి సరిహద్దు జిల్లాలై న దక్షిణకన్నడ, ఉడుపి, ఉత్తరకన్నడలలో అధికార యంత్రాంగాన్ని అలర్ట్‌ చేశారు. ఏమాత్రం రిస్క్‌ తీసుకోవద్దని అనుమానం తలెత్తిన సమక్షంలో వైద్య పరీక్షలు చేయించాలని జిల్లా ఆరోగ్యశాఖ అధికారులకు ఆదే శాలు జారీ చేసింది. న్యూరోవైరస్‌తో బాధపడుతున్న వారిలో వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం లక్షణాలు ఉంటున్నాయని అధికారులు అంటున్నారు. నీరు, ఆహారం ద్వారానే ఈ వైరస్‌ వ్యాపిస్తున్నట్టు గుర్తించామన్నారు. 


ఆందోళన కల్గిస్తున్న హఠాన్మరణాలు 

 కొవిడ్‌ అనంతరం హఠాన్మరణాల సంఖ్య పెరిగిపోతున్న వైనం కూడా ఆరోగ్యశాఖను ఆందోళనకు గురిచే స్తోంది. ఏమాత్రం ముందస్తు లక్షణాలు లేకుండానే బ్రెయిన్‌ హెమరేజ్‌, కార్డియాక్‌ అరెస్ట్‌ వంటి తీవ్ర సమస్యలకు గురవుతున్నవారు అధికమవుతున్నారని తెలిపింది. కొవిడ్‌ అనంతర ఆరోగ్య పరిస్థితులతో వీటికి సంబంధం ఉందా అనే కోణంలో వైద్యులు పరిశోధనలు చేస్తున్నారు. 2020 నుంచి రాష్ట్రంలో హఠాన్మర ణాల సంఖ్య పెరుగుతోంది. కొవిడ్‌ అవధి కూడా అదే కావడం గమనార్హం. 

 2020లో 49,925మంది ఇలా హఠాన్మరణాలకు గురయ్యారని ఇందులో 28,680మంది గుండెపోటుకు గురై మృతి చెందారని ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. 45-55ఏళ్లలోపువారిలోనూ, 18 ఏళ్లలోపు వారిలోనూ ఈ సమస్యలు ఉన్నట్టు గుర్తించామన్నారు. దీనిపై లోతుగా పరిశీలన జరిపి సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా ఆరోగ్యశాఖ నిపుణులకు సూచించినట్టు శాఖ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ బెంగళూరులో బుధవారం మీడియాకు తెలిపారు. 


భారీ వర్షాలతో పెరుగుతున్న డెంగీ కేసులు 

 రాష్ట్రంలో రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మళ్లీ డెంగీ వ్యాధి కేసులు పెరుగుతున్నట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుత ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు 15 వరకు సుమారు 3 వేలమందికి డెంగీ సోకింది. కాగా అక్టోబరు, నవంబరు నెలల్లో 2,516మందిలో డెంగీ లక్షణాలు కనిపించినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈనేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్న అన్ని జిల్లాల ఆరోగ్యశాఖ విభాగాలను అప్రమత్తం చేసినట్టు అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2021-11-25T18:37:34+05:30 IST