ఏపీలో కొత్తగా 1,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ABN , First Publish Date - 2022-02-12T00:43:34+05:30 IST
ఏపీలో కొత్తగా 1,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఏపీలో శుక్రవారం రోజు కొత్తగా 1,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇవాళ కోవిడ్ వల్ల ఐదుగురు మరణించారని అధికారులు తెలిపారు. ఏపీలో మొత్తం 23,11,133 పాజిటివ్ కేసులు నమోదవగా, కోవిడ్ వల్ల మొత్తం 14,688 మరణాలు సంభవించాయని ప్రభుత్వం తెలిపింది. ఏపీలో ప్రస్తుతం 32,413 యాక్టివ్ కేసులు ఉన్నాయని, కరోనా నుంచి 22,64,032 మంది కోలుకున్నారని వైద్య శాఖ అధికారులు వెల్లడించారు.